న్యూఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ సోమవారం మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ప్రముఖ రేణుకాల్ కోచింగ్ సెంటర్ (ఆర్సీసీ) అధినేత, ప్రొఫెసర్ శివరాజ్ మోటెగాంకర్ను అదుపులోకి తీసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఆధారంగా ఈయనపై సీబీఐ నిఘా పెట్టింది. ఆ వీడియోలో శివరాజ్ మోటెగాంకర్.. తాము నిర్వహించిన కెమిస్ట్రీ మాక్ టెస్ట్ పేపర్ల నుంచి ఎన్ని ప్రశ్నలు నీట్ పరీక్షలో వచ్చాయని విద్యార్థులను అడుగుతూ కనిపించారు.
అప్పటి నుంచే ఈయన పాత్రపై అధికారులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. శివరాజ్ మోటెగాంకర్ నడుపుతున్న ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులను నీట్ యూజీ పరీక్షకు సిద్ధం చేస్తుంది. దీనికి మహారాష్ట్రలో మొత్తం 9 బ్రాంచ్లు ఉండగా, ప్రధాన బ్రాంచ్ లాతూర్లో ఉంది. ఈయనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో పనిచేసే కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది.
