ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలి: సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలి: సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లకు బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఇదే కేసులో సీబీఐ కోర్టు ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ కేసులో అరెస్ట్ చేయడంతో ఈ ఇద్దరు బయటకు రాలేదు. ప్రస్తుతం అభిషేక్ రావు, విజయ్ నాయర్ ఇద్దరూ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆ కస్టడీ ముగియక ముందే సీబీఐ.. నిందితుల బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.  

మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబుల ఐదురోజుల ఈడీ కస్టడీ ముగిసింది. వీరికి 14 రోజుల పాటు ఈడీ జుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేసు విచారణ డిసెంబర్ 5 వరకు వాయిదా వేసింది. ఈ నెల 10వ తేదీన వీరిద్దరిని ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు.