
రూ. 500 కోట్ల బ్యాంకు రుణం ఎగవేతపై కేసు నమోదు
అమరావతి, వెలుగు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆఫీసులు, ఇళ్లపై సీబీఐ మంగళవారం దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుంటూరులోని ట్రాన్స్ ట్రాయ్ కార్యాలయాల్లో సీబీఐ మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేసింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ బ్యాంకు నుంచి రూ. 500 కోట్లు రుణం తీసుకుని ఎగవేతకు ప్రయత్నం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ట్రాన్స్ ట్రాయ్ సంస్థలో రాయపాటి భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు చేపట్టడం కోసం ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకుంది. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ట్రాన్స్ట్రాయ్ ఆఫీసులు గుంటూరులోని రాయపాటి ఇంట్లో సోదాలు చేశారు. రాయపాటిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస్లను నిందితులుగా చేర్చారు