కరోనా గుట్టు తేల్చనున్నసీసీఎంబీ.. నాలుగైదు రోజుల్లో రిజల్ట్స్

కరోనా గుట్టు తేల్చనున్నసీసీఎంబీ.. నాలుగైదు రోజుల్లో రిజల్ట్స్

సికింద్రాబాద్, వెలుగుకరోనా వైరస్​ పుట్టుక, దాని ఉనికి గుట్టును తేల్చే దిశగా సీసీఎంబీ పరిశోధనలు ప్రారంభించింది. హైదరాబాద్​లో నమోదైన కేసుల్లో 15 శాంపిల్స్​ ను సేకరించి వాటి జీనోమ్​పై రీసెర్చ్​ మొదలు పెట్టారు. నాలుగైదు రోజుల్లో వీటి రిజల్ట్స్​ వస్తాయని, అందులో కరోనా గుట్టు తేలుతుందని సైంటిస్టులు చెపుతున్నారు. కరోనా పుట్టుక, వ్యాప్తి, దాని వల్ల మరేమైనా ఇతర వ్యాధులు ప్రబలుతాయా? చైనా, ఇటలీలోని వైరస్​కు, మనదేశంలోని వైరస్​కు ఏమైనా తేడాలు ఉన్నాయా? అని పరిశోధనలు చేస్తున్నారు. హైదరాబాద్​ శాంపిల్స్​ వైరస్​ జీనోమ్ సీక్వెన్స్, మ్యుటేషన్​ పై టెస్టులు చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్​ నుంచి శాంపిల్స్​ సేకరించనున్నారు.

టెస్టుల రిజల్ట్స్​ వస్తున్నయ్

గాంధీ ఆస్పత్రి నుంచి రెండు రోజులుగా సీసీఎంబీకి కరోనా నిర్థారణ పరీక్షలకు సంబంధించి నమూనాలు అందుతున్నాయి. సోమవారం 60 శాంపిల్స్​ రాగా.. మంగళవారం మరో 190 శాంపిల్స్​ అందాయని మొత్తం 250 నమూనాలకు నిర్థారణ పరీక్షలు చేసి గాంధీకి పంపించినట్లు సీసీఎంబీ డైరెక్టర్​ డాక్టర్​రాకేశ్​మిశ్రా తెలిపారు. వెయ్యి శాంపిల్స్​ వచ్చినా ఒక్క రోజులోనే టెస్టులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వీటిలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయనే వివరాలను వెల్లడించలేమని, ప్రభుత్వమే అధికారికంగా వివరాలు చెపుతుందని అన్నారు.

రూ.2.65 కోట్లిచ్చిన మిడ్ డే మీల్స్ కార్మికులు