జమ్మూకశ్మీర్‌లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తం: సీఈసీ

జమ్మూకశ్మీర్‌లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తం:  సీఈసీ

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లో  ఎన్నికల సన్నద్ధతపై అధికారులు, పార్టీలతో సమీక్షించిన ఆయన.. పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండేలా చూస్తామని తెలిపారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేయవచ్చు. 

ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనాలి’ అని కోరారు.  శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తామని ఆయన అన్నారు. . 2019లో జమ్మూకశ్మీర్‌లో 67 శాతం ఓటింగ్ నమోదైంది.