- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: అనుమానాస్పద స్థితిలో సెట్రింగ్ కార్మికుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్జిల్లా పరిగికి చెందిన ఎండీ బాబా(31), అతని సోదరుడు సద్దాం మూడు నెలల కిందట ఇబ్రహీంపట్నంకు వచ్చి సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నారు. సోమవారం ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఎండీ బాబా(31) తిరిగి ఇంటికి రాకపోగా అతని సోదరుడు స్థానికంగా వెతికినా ఆచూకీ దొరకలేదు.
మంగళవారం ఉదయం మంచాలకు వెళ్లే రోడ్డులో తిరుమల బ్యాంగిల్స్టోర్ ముందు ఎండీ బాబా మరణించి పడి ఉన్నాడు. మల్లేశ్, లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తులతో గొడవ జరిగి నెట్టివేయగా కిందపడడంతో అతడు మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు సద్దాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.