చార్మినార్ గుమ్మటం అంచు భాగం కూలింది

చార్మినార్ గుమ్మటం అంచు భాగం కూలింది

హైదరాబాద్ లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ లో కొంత భాగం కూలిపోయింది. చార్మినార్ కు నాలుగు గుమ్మటాలు ఉండగా, వాటిలో ఓ గుమ్మటానికి సంబంధించి కొంత అంచు భాగం నిన్న(బుధవారం) రాత్రి సమయంలో నేలపై పడిపోయింది. ఈ సమయంలో ఘటనాస్థలి  దగ్గర ఎవరూ  లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చార్మినార్ సుందరీకరణలో భాగంగా గుమ్మటాల రిపేర్ జరుగుతోంది. పనుల్లో నాణ్యతా లోపం కారణంగా గుమ్మటం అంచు కూలింది.