బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే 6 నెలల్లో రెట్టింపు పైసలిస్తమని మోసం

బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే 6 నెలల్లో రెట్టింపు పైసలిస్తమని మోసం
  • బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే 6 నెలల్లో రెట్టింపు పైసలిస్తమని మోసం
  • పోలీసులను  ఆశ్రయించిన బాధితులు

ఖైరతాబాద్, వెలుగు: బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఆరు నెలల్లో రెట్టింపు డబ్బులు ఇస్తానని ఓ వ్యక్తి జనాలను మోసం చేశాడు  ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ ఆభర్ణ జువెలర్స్ పేరుతో శ్రీ నగర్ కాలనీలో ఆఫీస్ ​ఏర్పాటు చేశాడు. విజయ్ కుమార్ అనే వ్యక్తి  ద్వారా మార్కెటింగ్ చేయించాడు. బంగారంపై పెట్టుబడులు పెట్టాలని, ఆరు నెలల తర్వాత అది రెట్టింపు అవుతుందని జూబ్లీహిల్స్ కు చెందిన  మున్నీసా ఖాసిం(73) అనే మహిళను నమ్మించాడు. దీంతో మున్నీసా తనతోపాటు, కుటుంబ సభ్యులతోనూ లక్షల్లో పెట్టుబడులు పెట్టించింది. నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆభర్ణ జువెలర్స్ మేనేజ్​మెంట్​ను బాధితులు ప్రశ్నించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సంస్థ డైరెక్టర్లు రామకృష్ణ, సుధాకర్​పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.