ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని యువకుడు మోసం చేసిన ఘటన ఎల్బీ నగర్‌లో జరిగింది. వివరాలు.. రమాదేవి అనే యువతి, అనురుధ్ పాండే అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ పేరుతో నమ్మించి రమాదేవిని అనురుధ్ మోసం చేశాడు. దీంతో అవమానానికి గురైనట్లు భావించిన రమాదేవి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. నాల్రోజుల కింద యాసిడ్ తాగిన రమాదేవిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. రమాదేవి తండ్రి కిష్టయ్య ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌‌లో అనురుధ్‌పై ఫిర్యాదు చేశాడు. అయితే యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేయకుండా నామమాత్రంగా కేసు పెట్టి వదిలేశారని రమాదేవి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఎల్బీనగర్ పీఎస్ ముందు యువతి కుటుంబీకులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. తమకు న్యాయం చేయాలని రమాదేవి ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.