చేవెళ్ల, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు. ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.