ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. గాల్లో ఉండగానే వెనక్కి.. ఏమైందంటే.. ?

ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. గాల్లో ఉండగానే వెనక్కి.. ఏమైందంటే.. ?

ముంబై నుంచి చెన్నై బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగానే వెనక్కి వచ్చింది. క్యాబిన్ లోపల మండుతున్న వాసన రావడంతో ముంబైకి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ( జూన్ 27 ) జరిగిన ఈ ఘటనపై ఆదివారం ( జూన్ 29 ) క్లారిటీ ఇచ్చింది ఎయిర్ ఇండియా సంస్థ. శుక్రవారం రాత్రి 10: 55 గంటలకు ముంబై నుండి చెన్నైకి బయలుదేరిన AI 639 విమానం క్యాబిన్ లో మండుతున్న వాసన రావడంతో ముందు జాగ్రత్త చర్యగా తిరిగి ముంబైకి వచ్చినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.

ALSO READ | ఉత్తరాఖండ్‎లో క్లౌడ్ బరస్ట్.. అర్ధాంతరంగా చార్‎ధామ్ యాత్ర వాయిదా

"విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని... ప్రత్యామ్నాయా ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు తమ సంస్థ అత్యంత పరాధాన్యత ఇస్తుందని తెలిపింది ఎయిర్ ఇండియా సంస్థ. 

ఇదిలా ఉండగా అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన తర్వాత వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతుండటం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.