
గౌహతినుంచి చెన్నై వెళ్లున్న ఇండిగో విమానం అత్యవసర లాండింగ్ పై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం(జూన్ 19) బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ బస్ A321ను అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్లు.చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఫ్యూయెల్ అందకపోవడం వల్లనే పైలట్లు బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు చెప్పారు.
గురువారం సాయంత్రం 4.40గంటలకు గౌహతినుంచి బయల్దేరి సాయంత్రి 7.45గంటలకు చెన్నై చేరుకోవాల్సి ఉండగా.. చెన్నై గగన తలంలో ఉన్నప్పుడు విమానంలో ఇంధనం సరఫరా నిలిచిపోయినట్లు గుర్తించిన పైలట్లు చెన్నై ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని సంప్రదించారు. తగినంత ఇంధనం లేకపోవడంతో, "మేడే" డిస్ట్రెస్ కాల్ జారీ చేశారు.
అయితే ATC నుంచి అనుమతి రాకపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR)కి మళ్లించారు.గురువారం రాత్రి 8:00 గంటలకు విమానం బెంగళూరు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంలో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటన విమానయానంలో ఇంధన నిర్వహణ,భద్రతా ప్రోటోకాల్ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.