స్టేజిపైనే అనసూయకు సారీ చెప్పిన ఛోటా.. ఇంతకీ ఏం జరిగింది?

స్టేజిపైనే అనసూయకు సారీ చెప్పిన ఛోటా.. ఇంతకీ ఏం జరిగింది?

కొత్త హీరో విరాట్ కర్ణ(Virat karrna) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ పేద కాపు1(Pedakapu1). సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth addala) తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నివహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

అయితే ఈ కార్యక్రమంలో అనసూయ, ఛోటా కె నాయుడు మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. ఈవెంట్ లో భాగంగా అనసూయ పెదకాపు1 సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను అక్కమ్మ అనే పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన గొప్ప పాత్రల్లో ఇది ఒకటి. ఇలాంటి సినిమాలో నటించడం నా అదృష్టం. దీనికి కారణమైన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారికి థాంక్యూ సో మచ్. మొత్తానికి అక్కమ్మ అనే పేరు చెప్పగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

అలా చెప్పుకుంటూ కెమెరామెన్ ఛోటా కె నాయుడు గురించి ప్రస్తావించిన అనసూయ.. సర్ మీరు నా పేరు చెప్పడం మర్చిపోయారు. కానీ నేను మర్చిపోను అంది.. దానికి సమాధానంగా ఛోటా కె నాయుడు స్పందిస్తూ.. సినిమాలో అనసూయ పాత్ర కాస్త లేట్ గా ఎంట్రీ ఇస్తుంది అందుకే తరువాత చెపుదాం అనుకున్నాను. అయామ్ సారీ అంటూ స్టేజి పైనే అనసూయకు సారీ చెప్పారు ఛోటా కె నాయుడు. వెంటనే అనసూయ..  కూడా ‘అయ్యో సార్.. మీరు సారీ చెప్పడమేంటి’ అంటూ నవ్వుతూ బదులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది.