హాంకాంగ్లో సివిల్ డ్రెస్లో క్లీనింగ్కి దిగిన చైనా ఆర్మీ
బీజింగ్: ప్రో-డెమొక్రసీ ఆందోళనలు మొదలైన తర్వాత చైనా ఆర్మీ తొలిసారి హాంకాంగ్లో అడుగుపెట్టింది. దాదాపు ఐదు నెలలుగా నిరసనలు, ఆందోళనలు, ఉద్రిక్తత కొనసాగుతుంటే .. శనివారం చైనా బలగాలు
హాంకాంగ్లోకి ప్రవేశించాయి. హాంకాంగ్ గ్యారీసన్ ఆఫ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీ-ఎల్ఏ)కి చెందిన జవాన్లు సివిల్ డ్రెస్సుల్లో సిటీలోకి వచ్చి.. బాప్టిస్ట్ యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాల్లో బారికేడ్లను, వీధుల్లో ఉన్న ఇతర చెత్తను తొలగించారు. బ్లాక్షార్ట్స్, గ్రీన్ టీషర్ట్స్ వేసుకున్న జవాన్లు రెడ్ బకెట్లు పట్టుకుని క్లీనింగ్చేశారు. చైనా సోల్జర్లతో పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా క్లీనింగ్లో పాల్గొన్నారు.
గత ఏడాది అక్టోబర్లో చైనా జవాన్లు హాంకాంగ్లో పబ్లిక్ కమ్యూనిటీ వర్క్లో పాల్గొన్నారు. హాంకాంగ్ గవర్నమెంట్తో తమకు సంబంధం లేదని, తామే ఈ క్లీనింగ్ మొదలుపెట్టామని, వాయిలెన్స్ను ఆపేసి.. విధ్వంసానికి ముగింపు పలకడమే తమ బాధ్యత అని ఓ చైనా జవాన్ అన్నాడు. కొద్దిరోజుల క్రితం చైనా ప్రెసిడెంట్ జి జిన్ పింగ్ కూడా ఇవే మాటలు చెప్పారు. కాగా, మిలటరీ సైట్లకు వెలుపల వాలంటరీ సర్వీసు కోసం జవాన్లను పంపే విషయంలో పీఎల్ఏనే సొంతంగా నిర్ణయం తీసుకుందని, దీనిపై లోకల్ గవర్నమెంట్కు సమాచారం లేదని హాంకాంగ్ సెక్రెటరీ ఫర్ సెక్యూ రిటీ జాన్ లీ కుచియు చెప్పారు.