‘సీఐ’కి సెల్యూట్ చేసిన డీఎస్పీ!

‘సీఐ’కి సెల్యూట్ చేసిన డీఎస్పీ!

గోరంట్ల మాధవ్. అనంతపూర్ సీఐగా పని చేస్తూ స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని సవాల్ చేసిన వ్యక్తి. ఆ తర్వాత జాబ్ కు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలిచారు. మాధవ్ సీఐగా పని చేస్తున్న సమయంలో డీఎస్పీగా ఉన్న ఆఫీసర్ కు సెల్యూట్ చేసేవారు. ఎంపీగా ఎన్నికైన మాధవ్ కు హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్దే అదే డీఎస్పీ కనిపించారు. మాధవ్ ను గమనించిన ఆఫీసర్ వెంటనే సెల్యూట్ చేశారు. అందుకు ప్రతిగా మాధవ్ కూడా సెల్యూట్ తో ఆఫీసర్ ను గౌరవించారు.