
సాధారణంగా సెలబ్రిటీలు తమను తాము ప్రత్యేకంగా పరిచయం చేసుకోరు. ఎందుకంటే..అప్పటికే సినిమాలు, టీవీల్లో నటిస్తూ..ఫుల్ ఫేమస్ అవుతారు. అయితే అందరు సెలబ్రిటీలను కూడా ప్రజలు గుర్తు పట్టరు. కానీ బాలీవుడ్ లో నటించిన హీరోలు, హీరోయిన్లను మాత్రం దేశంలో ఈ మూల ఉన్నా మాగ్జిమమ్ గుర్తు పట్టేస్తారు. వీరికి పబ్లిక్ ప్లేసుల్లో, విమానాశ్రయాల్లో అయితే ఫుల్ ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సామాన్యుల నుంచి అధికారుల వరకు స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. వారితో ఫోటోలు, సెల్పీలు దిగేందుకు తెగ ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ ఇక్కడ రివర్స్ సన్నివేశం జరిగింది. ముంబై ఎయిర్ పోర్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీకి వింత అనుభవం ఎదురైంది.
ALSO READ: లియో మూవీ వివాదం : గ్రూప్ డ్యాన్సర్లకు డబ్బులు ఎగ్గొట్టారంట..
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్టోబర్ 11వ తేదీన ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్లింది. అయితే ఆమె ముంబై ఎయిర్ పోర్టులోపలికి వెళ్తుండగా..CISF పోలీస్ దిశా పటానీని ఎయిర్ పోర్టు గేట్ దగ్గరే ఆపేశాడు. ఎవరు నువ్వు..ఎక్కడికి వెళ్తున్నావ్..బోర్డింగ్ పాస్ చూపించు అని అడిగాడు. దీంతో CISF పోలీస్ ప్రశ్నలకు షాక్ తిన్న దిశా పటానీ..ఆ తర్వాత తేరుకుని..తన టికెట్, బోర్డింగ్ పాస్ చూపించింది. అయితే దీంతో పాటు..గుర్తుంపు కార్డు కూడా చూపించాలని కోరాడు. అప్పటి వరకు లోపలికి అనుమతించబోనని తేల్చి చెప్పాడు. దీంతో చేసేదేమి లేక..దిశా పటానీ తన ఆధార్ కార్డు కోసం హ్యాండ్ బ్యాగ్ లో వెతికి..పోలీస్ కు చూపించింది. దీంతో సంతృప్తి చెందిన CISF పోలీస్..దిశా పటానీని లోపలికి అనుమతించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
దిశా పటానీని ముంబై ఎయిర్ పోర్టులో ఆపిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. రూల్ ఈజ్ రూల్..రూల్ ఫర్ ఆల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నియమాలు అందరికి వర్తిస్తాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. సెలబ్రిటీలు తమ ఐడీ కార్డులను తమ వెంట తీసుకెళ్లాలని..విమానాశ్రయాల్లో దీని నుంచి మినహాయింపు ఉంటుందని అనుకోవద్దని సూచించారు.
ప్రస్తుతం దిశా పటానీ నాగ్ అశ్విన్ కల్కీ 2898AD సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ , దిపికా పదుకునే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.