హైదరాబాద్,వెలుగు: సీపీఎస్ రద్దుకు ఈ నెల12న నిర్వహించే చలో హైదరాబాద్కు సిటీ సివిల్ కోర్టు ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. మంగళవారం కోర్టు జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో జరిగిన సమావే శానికి సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, సంఘం జనరల్ సెక్రటరీ కల్వల్ శ్రీకాంత్, జుడీషియరీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ రిటైర్ మెంట్ తర్వాత ఉద్యోగులు ఇబ్బందులు పడేలా సీపీఎస్ విధానం ఉందని చెప్పారు. ఎంప్లాయీస్కు పింఛన్ ఇచ్చే ఓపీఎస్ విధానమే కావాలని కోరారు. రాష్ట్రంలో 1.72 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్లో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. సర్వీస్ పింఛన్ కోసం ఐక్యంగా ఉండాలని కోరారు. సమావేశంలో జుడీషియరీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ పవన్, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు పాల్గొన్నారు.