కశ్మీర్ ఎలా ఉందో స్వయంగా వెళ్లి చూస్తా: సుప్రీం సీజే గొగోయ్

కశ్మీర్ ఎలా ఉందో స్వయంగా వెళ్లి చూస్తా: సుప్రీం సీజే గొగోయ్

కశ్మీర్ లో పరిస్థితులు చూసేందుకు అవసరమైతే తాను శ్రీనగర్ లో పర్యటించేందుకు సిద్ధమన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్. కశ్మీర్ ప్రజలు జమ్మూకశ్మీర్ హైకోర్టుకు వెళ్లలేకపోతున్నారన్న ఓ మానవహక్కుల ఉద్యమకారుడి కామెంట్స్ పై.. ధర్మాసనం తరఫున ఆయన స్పందించారు. అవసరమైతే తానే కశ్మీర్ హైకోర్టుకు వస్తానని, శ్రీనగర్ లోనూ పర్యటిస్తానని చెప్పారు చీఫ్ జస్టిస్. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి.. దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. ఈ కామెంట్స్ చేశారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, ఆరోగ్య వసతులు, నిత్యావసరాలు అందుతున్నాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.