వచ్చే ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోతడు: గొనె ప్రకాశ్ రావు

వచ్చే ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోతడు: గొనె ప్రకాశ్ రావు

బషీర్ బాగ్, వెలుగు: ఏపీ కాంగ్రెస్ చీఫ్​ షర్మిలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆర్టీసీ మాజీ చైర్మన్ గొనె ప్రకాశ్ రావు ఖండించారు. సీఎం జగన్ అనుచరులే ఆమెపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్రతో వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లారని గుర్తుచేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు.

అడిగిన పదవి ఇవ్వకపోవడం వల్లే వైసీపీ సర్కారుపై షర్మిల విమర్శలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని గొనె ప్రకాశ్ రావు తెలిపారు. పరాయి వాళ్లకు పదవులు కట్టబెట్టిన జగన్ కు సొంత చెల్లి కనిపించలేదా అని ప్రశ్నించారు. సజ్జల సలహాలతో వైసీపీ సర్కార్ పరిస్థితి దిగజారిపోతున్నదని మండిపడ్డారు.