తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ అని విమర్శించారు సీఎం కేసీఆర్. ఉన్న తెలంగాణను తుడిచేసింది కాంగ్రెస్, నెహ్రూనేనన్నారు.1969లో ఉవ్వెత్తును ఎగసి పడ్డ తెలంగాణ ఉద్యమాన్ని నిరాకరించింది ఇందిరా గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. తెలంగాణ ఏ ఒక్కరితోనే వచ్చింది కాదన్నారు. 58 సంవత్సరాల సుధీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందన్నారు.
- ALSO READ: మూగబోయిన ఉద్యమగళం..
తెలంగాణ తలసరి ఆదాయం 3లక్షల 12 వేలుగా ఉందని.. వెక్కిరించిన ఏపీ తలసరి ఆదాయం 2లక్షలుగా ఉందన్నారు. గుజరాత్ మోడల్ అంటూ దేశమంతా గోల్ మాల్ చేశారని విమర్శించారు. వెక్కిరించిన ఏపీ కంటే తెలంగాణ ఎంతో ముందుందన్నారు. సమ్మిళిత అభివృద్ధి జరిగితే తప్ప తలసరి ఆదాయం పెరగదన్నారు.
బీజేపీ వాళ్లు ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేశారని..అయితే హైదరాబాదే తెలంగాణలో ఉంది ప్రత్యేక రాష్ట్రం ఎందుకని ఆనాడు ఎల్ కే అద్వానీ అన్నారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో పరిస్థితి మరింత దిగజారి పోయామన్నారు. సంస్కరణల పేరుతో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచారన్నారు.