అక్టోబర్ 6న సీఎం బ్రేక్ ​ఫాస్ట్​ స్కీం ప్రారంభం

అక్టోబర్ 6న సీఎం బ్రేక్ ​ఫాస్ట్​ స్కీం ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: సీఎం బ్రేక్​ఫాస్ట్​స్కీంను ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల హై స్కూల్​లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​ రావు ప్రారంభించనున్నారు. దసరా నుంచి ఈ స్కీం ప్రారంభిస్తామని గతంలో ప్రభుత్వంప్రకటించింది. త్వరలో ఎన్నికల కోడ్​ రానుండడంతో అధికారికంగా 6న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.