
తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాడైన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని కేసీఆర్ సూచించారు. పరిపాలన సంస్కరణలో భాగంగా.. వికేంద్రీకరణ, పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు, భవనాల శాఖలో చేపట్టాల్సిన నియామకాలపై చర్చించారు. రోడ్లు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు.
మారుమూల గ్రామాల్లో కూడా రోడ్ల పరిస్థితిపై దృష్టి పెట్టాలని చెప్పారు. పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం వల్ల... రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అలాగే తదితర అంశాలపై సీఎం చర్చించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.