సమ్మెకు పోయి.. ఉద్యోగాలు ఊడగొట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధులలోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
‘ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం. మరోసారి వారు పొరపాటు చేయొద్దు. ఎంతోమందికి ఎన్నో చేశాం.. వారికి మాత్రం ఎందుకు చేయం. సెర్ప్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.