గిరిజనులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం

గిరిజనులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం

హైదరాబాద్: గిరిజనులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. పార్టీ ఆఫీస్ లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ స్పూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు. మూడెకరాల భూమి, 10శాతం రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోలేని.. సీఎం కేసీఆర్.. గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుర్రంపోడు తండాలో గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు బండి సంజయ్.