కుటుంబ పాలనతో అప్పుల తెలంగాణగా మారింది

కుటుంబ పాలనతో  అప్పుల తెలంగాణగా మారింది

ఢిల్లీ: తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా గురువారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని అమరవీరుల స్థూపానికి నివాళి, తెలంగాణ తల్లి విగ్రహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి వివేక్ వెంకటస్వామి పుష్పాంజలి గటించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలు ఆశించినట్లు రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదన్నారు.  8 సంవత్సరాల్లో పేదలు పేదలుగానే ఉన్నారని, అప్పుల రాష్ట్రంగా తయారైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కుటుంబ పాలన వలన రాష్ట్రం వెనకబడిపోయిందన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు ఎవ్వరికీ అందలేదని..తెలంగాణ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్.. కుటుంబ పాలన వల్ల వెనకబడిపోయిందన్న వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు వివేక్ వెంకటస్వామి.