ఎరువుల ధర పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోడికి లేఖ రాశారు సీఎం కేసీఆర్. 2022కల్లా రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని గొప్పలు చెప్పి.. ఇప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఐదేళ్లలో అన్ని రేట్లు డబుల్ అయ్యాయన్నారు. పెట్రో రేట్లు పెరగడం కూడా రైతులకు భారమైందన్నారు కేసీఆర్. వ్యవసాయ ఖర్చు విపరీతంగా పెరిగిందని లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో రైతు ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. MSPని 150శాతం పెంచామంటూ అందరినీ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. రైతులకు మద్దతు ధర అమలుపై ఎలాంటి మెకానిజం లేదన్నారు సీఎం. రైతులకు సరైన మద్దతు ధర లేదన్నారు. ధాన్యం తక్కువ కొంటున్నారన్న విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. రైతులు తమపంటను తక్కువ ధరకు అమ్ముకునేలా కేంద్రం చర్యలున్నాయన్నారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిందన్నారు. కరెంట్ మీటర్లు పెట్టాలన్న నిర్ణయంపై రైతులు ఆందోళనతో ఉన్నారన్నారు. ఎరువులు ధరలు ఇప్పుడు ఉన్నట్లుగానే కొనసాగించాలన్నారు.
ప్రధాని మోడికి సీఎం కేసీఆర్ లేఖ
- తెలంగాణం
- January 12, 2022
లేటెస్ట్
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు
- గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలు
- V6 DIGITAL 17.05.2024 EVENING EDITION
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!