పీఎం మోడీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్

పీఎం మోడీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు సీఎం కేసీఆర్.  ప్రధాని మోడీ, రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు శుక్రవారం కేసీఆర్‌ వేర్వేరుగా లేఖలు రాశారు. భారత ప్రభుత్వం, ఆధీనంలో విభాగాలు, యూపీఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్‌బీఐ, స్టాఫ్‌ సెలెక్షన్‌ వంటి విభాగాల్లో పరీక్షలు హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారని.. దీంతో ఆంగ్ల మాధ్యమంలో చదవని, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు కేంద్ర నియామకాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని లెటర్ లో తెలిపారు. అన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చేలా ప్రాంతీయ భాషల్లోనూ నియామక పరీక్షలు నిర్వహించాలని కోరారు సీఎం కేసీఆర్.