- అవినీతికి పాల్పడితే డిక్టేటర్గా మారతా
- నేతలకు సీఎం స్టాలిన్ వార్నింగ్
చెన్నై: ప్రజా ప్రతినిధులు అవినీతి, అక్రమాలకు పాల్పడితే తాను డిక్టేటర్గా మారి కఠిన చర్యలు తీసుకుంటానని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. సోమవారం చెన్నైలో అర్బన్ లోకల్ బాడీస్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ‘‘డెమోక్రసీ అంటే ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించడం. అంతేతప్ప మనకు నచ్చింది చేయడం కాదు. నేను అలా ఉండలేదు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే డిక్టేటర్గా మారి కఠిన చర్యలు తీసుకుంటా. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే కాదు.. అందరికీ చెప్తున్నా..’’ అని హెచ్చరించారు. మహిళా ప్రజాప్రతినిధులు.. తమ బాధ్యతలను భర్తలకు అప్పగించవద్దని కూడా సీఎం సూచించారు.