
హైదరాబాద్ లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలిపారు. ఇవాళ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ను కలిశారు కేఏపాల్. ఇద్దరు కాసేపు ఈసదస్సుపై చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Global Peace Economic Summit
— Congress for Telangana (@Congress4TS) January 29, 2024
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్.
Prajashanti Party President KA Paul paid a courtesy call to Telangana Chief Minister Revanth Reddy.#RevanthReddy @revanth_anumula… pic.twitter.com/FlC1GglVvW
అక్టోబర్ 2న హైదరాబాద్ లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సదస్సు నిర్వహించడానికి రేవంత్ అంగీకరించారని తెలిపారు కేఏపాల్. పలు దేశాల ప్రతినిధులు గొప్ప నగరమైన హైదరాబాద్ ను విజిట్ చేయాలని కోరారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కేఏ పాల్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ లో పాల్గొనాలని ప్రపంచ దేశాలను కోరారు.