సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్

హైదరాబాద్ లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్  నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలిపారు. ఇవాళ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ను కలిశారు కేఏపాల్. ఇద్దరు కాసేపు  ఈసదస్సుపై చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు.

 

 అక్టోబర్ 2న హైదరాబాద్ లో  గ్లోబల్ పీస్ ఎకనామిక్ సదస్సు నిర్వహించడానికి రేవంత్ అంగీకరించారని తెలిపారు కేఏపాల్. పలు దేశాల  ప్రతినిధులు గొప్ప నగరమైన హైదరాబాద్ ను విజిట్ చేయాలని కోరారు.  అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..  కేఏ పాల్ ఆధ్వర్యంలో నిర్వహించే  గ్లోబల్ పీస్ ఎకనామిక్  సమ్మిట్ లో పాల్గొనాలని ప్రపంచ దేశాలను  కోరారు.