గోబెల్స్​ మళ్లీ పుట్టాడు..కేసీఆర్ పై ‘ఎక్స్’లో సీఎం రేవంత్ ఫైర్

గోబెల్స్​ మళ్లీ పుట్టాడు..కేసీఆర్ పై ‘ఎక్స్’లో  సీఎం రేవంత్ ఫైర్

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని అందులో ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి

నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్ లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-..05..-2023 నుండి 05..-06..-2023 వరకు) అందులో కూడా విద్యుత్, నీటి కొరత గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ఠ.. అని రేవంత్ విరుచుకుపడ్డారు.