ప్రశ్నించే గొంతుక కాబట్టే అందరూ దగ్గరుండి గెలిపించారు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రశ్నించే గొంతుక కాబట్టే అందరూ దగ్గరుండి గెలిపించారు: సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా సునితా మహేదర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గురువారం కుత్బుల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. 2018లో కేసీఆర్ కక్ష గట్టి.. కొండగల్ ఇంట్లో ఉన్న తనని అర్థరాత్రి తలుపులు బద్దలుకొట్టి పోలీస్ స్టేషన్ లో బంధించి ఓడగొట్టాడని అన్నారు. 3నెలలు తిరిగే లోపు.. పార్టీ మల్కాజిగిరి బరిలో దించెతే మూడు రంగుల జెండా పట్టుకొని గెలిచానని అన్నారు. 

ప్రశ్నించి గొంతుక కాబట్టే సీపీఎం, కోదండ రాం దగ్గరుండి గెలిపించారన్నారు. మల్కాజ్ గిరి ప్రజలు ఇచ్చిన అధికారంతో  రెండున్నర ఏళ్ల పాటు ప్రజల మధ్యనే ఉన్నా అని ఆయన తెలిపారు. రోజుకు 18గంటలు ప్రజాక్షేత్రంలోనే ఉన్నా అని రేవంత్ రెడ్డి అన్నారు. తన పోరాటం చూసి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను బొందపెట్టి కాంగ్రస్ ని గెలిపించారని అన్నారు.