వివేక్ వెంకటస్వామి, పొన్నం పెప్పర్ స్ప్రేలకు ఎదురొడ్డి పోరాడిన్రు: సీఎం రేవంత్ రెడ్డి

వివేక్ వెంకటస్వామి, పొన్నం పెప్పర్ స్ప్రేలకు ఎదురొడ్డి పోరాడిన్రు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇచ్చింది  మా వాళ్లే..  తెచ్చింది మా వాళ్లేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బిల్లు పార్లమెంటులో  ప్రవేశపెట్టినప్పుడు  పొన్నం ప్రభాకర్, రాజ్ గోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మధుయాష్కి, అంజన్ కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, సురేష్ షెట్కార్  లాంటి  చాలా మంది కాంగ్రెస్ ఎంపీలు  సభలో ఉన్నారని చెప్పారు.  ఆనాడు పెప్పర్ స్ప్రేల  బారిన పడి, మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింప జేసే సమయంలో పార్లమెంటులో ఉన్నారని తెలిపారు.

 తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు కేసీఆర్ ఏక్కడున్నారో  చెప్పాలన్నారు రేవంత్. కావాలంటే లైవ్ రికార్డులు బయటకు  తీయాలన్నారు సీఎం రేవంత్. వాస్తవాలను  కూడా తప్పుల తడక అని తప్పించుకునే యత్నం చేస్తున్నారు.తప్పు ఒప్పుకోండి కానీ.. కప్పి పుచ్చుకోకండని రేవంత్ అన్నారు.