తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..సీఎం రేవంత్రెడ్డి

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..సీఎం రేవంత్రెడ్డి

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్​రెడ్డి. రాష్ట్రసాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని సీఎం కోరారు. తెలంగాణ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. జూన్​ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న తెలిపారు. 

మరోవైపు ప్రధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​ కూడా రాష్ట్రప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు కేసీఆర్. అదే స్ఫూర్తిని కాంగ్రెస్​ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలని కేసీఆర్​ కోరారు. 

ఆదివారం (జూన్​ 1) సాయంత్రం హైదరాబాద్లోని కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ లో మంత్రులతో సీఎం రేవంత్​ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్​ 5న కేబినెట్​సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.  జూన్​ 2 రాష్ట్ర అవతరణ వేడుకలు, ఏర్పాట్లపై సీఎం, మంత్రులు చర్చించారు. 

మే29,30 తేదీల్లో వివిధ జిల్లాల్లో పర్యటించిన మంత్రులు.. రిపోర్టులను సీఎం రేవంత్​రెడ్డికి వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులుపై మంత్రుల తమ నివేదికలను వివరించారు. దీంతోపాటు రాజీవ్​ యువ వికాసం అమలు, పంట సాగుసన్నద్దతప చర్చించారు. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎం రేవంత్​ రెడ్డికి నివేదికను వివరించారు.