అభయహస్తం అప్లికేషన్లు సరిగ్గా నింపేలా చూడాలి : ​జితేశ్​వీ పాటిల్

అభయహస్తం అప్లికేషన్లు సరిగ్గా నింపేలా చూడాలి :  ​జితేశ్​వీ పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: ప్రజలు అభయహస్తం అప్లికేషన్లను సరిగ్గా నింపేలా చూడాలని కామారెడ్డి కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్​ పేర్కొన్నారు. గురువారం ఆయన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్​లో ప్రజాపాలన గ్రామసభను పరిశీలించారు. స్థానికులు, అప్లికేషన్లు స్వీకరిస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్లికేషన్ల వివరాలను రిజిస్టర్​లో, ఆన్​లైన్​లోనూ ఎంట్రీ  చేయాలన్నారు. డేటా ఎంట్రీ కోసం కంప్యూటర్లు, స్టాఫ్​ను రెడీ చేసుకోవాలని సూచించారు.

ఉత్తనూర్​లో అడిషనల్​ కలెక్టర్ పరిశీలన​

సదాశివ్​నగర్​ మండలం ఉత్తునూర్​లో ప్రజాపాలన గ్రామ సభను గురువారం అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​పరిశీలించారు. అప్లికేషన్​ ఫామ్​లో లబ్ధిదారులు తమకు అవసరమైన వాటికే టిక్​ మార్కు చేశారా అని పరిశీలించాలన్నారు. ఆయనతో పాటు తహసీల్దార్​ హిమబిందు ఉన్నారు.