ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్​ చేసిన కలెక్టర్​

ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్​ చేసిన కలెక్టర్​
  •  పత్రికల్లో మంత్రులకు విసెష్​ చెప్తూ ప్రకటనలు ఇచ్చిన ఫలితం  

ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరి ఉద్యోగులను ​సస్పెండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.  ఈనెల 9న ఉగాది సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొమ్మలతో శుభాకాంక్షలు తెలుపుతూ సర్వే ల్యాండ్ రికార్డ్స్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న షేక్ అఫ్జల్ హసన్, జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తున్న ఆర్​వీఎస్ సాగర్ ఒక పత్రికలో ప్రకటన ఇచ్చారు.

 ఈ విషయమై ఆర్టీఐ ఆక్టివిస్ట్ కోయిని వెంకన్న ఫిర్యాదు మేరకు, బీజేపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్​ ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్​ ఇచ్చారు. కాగా, ఇద్దరు ఉద్యోగులు టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కొనసాగుతున్నారు.