పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలి : తేజస్ నందలాల్ పవార్

పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలి : తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : ప్రతిఒక్కరూ పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటేషన్–-2025 పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ కు​ పర్యావరణ కాంపిటేషన్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీకి జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 

లక్కీ డ్రా ద్వారా కింద 192 విద్యార్థుల ఎంపిక...

లక్కీ డ్రా ద్వారా  బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 192 విద్యార్థులను ఎంపిక చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు 2025 –26 విద్యాసంవత్సరంలో బెస్ట్ అవెలబుల్ స్కీం కింద వివిధ పాఠశాలల్లో 1వ తరగతి డేస్కాలర్, 5వ తరగతి రెసిడెన్షియల్ లో ప్రవేశాలకు మంగళవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ తరగతిలో 94 మంది, 5వ తరగతిలో 98 మంది విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. 

ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కారం.. 

రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 15 నాటికి భూసమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.