తెలంగాణ కూడా యూపీలాగా మారుతుంది

తెలంగాణ కూడా యూపీలాగా మారుతుంది

తెలంగాణ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఉత్తర్ ప్రదేశ్‌లో మాదిరిగా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత సంపత్‌ కుమార్. తెలంగాణ కూడా యూపీలాగా మారిపోతుందని అన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. బుధ‌వారం శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్..రాష్ట్రంలో శాంతి రాష్ట్రం ఆదర్శంగా ఉన్నదని అన్నారు. కేసీఆర్ కు సిగ్గు ఉందా..! అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు

ఖ‌మ్మం జిల్లా లో మైన‌ర్ బాలిక‌పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా… గురువారం మినిస్టర్ క్వార్టర్స్ లో హోమ్ మంత్రి ఇల్లు ను ముట్టడించారు. దీంతో పోలీసులు సంపత్ తో పాటు కాంగ్రెస్, అనుబంధ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి గోషా మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై మండిప‌డుతూ.. ఖమ్మం అత్యాచార బాధితురాలిని ఒక్కరైనా పరామర్శించారా? అని సంపత్ ప్రశ్నించారు. దోషులను ప్రభుత్వమే కఠినంగా శిక్షించాలన్నారు. హోంమంత్రి మహమూద్‌ అలీ వెంటనే రాజీనామా చేయాలని సంపత్‌ డిమాండ్ చేశారు.