నీళ్లు న‌మ‌లొద్దు..సమాధానం చెప్పాలి

నీళ్లు న‌మ‌లొద్దు..సమాధానం చెప్పాలి

కరోనాను నియంత్రించే అవకాశాలున్నా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు పనితీరును హైకోర్టు మరోసారి ఎండగట్టింద‌ని అన్నారు కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య శాంతి

క‌రోనా ట్రీట్మెంట్ పై స‌ర్కారు నిర్ల‌క్ష్యం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.కేసులు పెరుగుతుంటే నిజాల్ని దాచేస్తూ కోర్ట్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిప‌డ్డారు.

తమ ఆదేశాల అమలుకు ఇదే చివరి అవకాశమని న్యాయస్థానం హెచ్చరించేలా పరిస్థితి దిగజారిందంటే క‌రోనా పై ప్ర‌భుత్వం చిత్త శుద్ధి ఎలా ఉందో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని సూచించారు.

అధికార యంత్రాంగాన్ని తాము ఇంతగా మందలిస్తుంటే..మెచ్చుకున్నట్టు చెప్పుకుంటున్నారన్న న్యాయస్థానం వ్యాఖ్యలతో పాలకుల నిజ‌స్వ‌రూపం బ‌ట్ట‌బ‌య‌లైంద‌న్న విజ‌య శాంతి…చికిత్సను అందించడంలో ఐసీఎంఆర్ నిబంధనలను గాలికొదిలేశారన్న కోర్టు వ్యాఖ్యలకు బదులివ్వలేక కేసీఆర్ సర్కారు నీళ్ళు నమలాల్సి వచ్చింద‌న్నారు.

దీనికి తోడు ప్రైవేట్ న‌ర్సుల దుస్ధితిపై హెచ్ ఆర్సీ నుంచి ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు నోటీసులు అందుకున్నార‌ని, తాము ఎన్నుకున్న పాలకుల ప‌రిపాల‌న‌లో జనం కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి నెలకొంద‌ని అన్నారు కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య శాంతి.