అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతల  నివాళులు

అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతల  నివాళులు

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలు  నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క ..తెలంగాణ  వస్తే  అన్ని వర్గాల  వారు బాగుంటారని  అందరూ ఆశించారన్నారు. సామజిక తెలంగాణ ఏర్పడుతుందనుకున్నాం కానీ.. తెలంగాణ  ఆశయాలు ఏ  మాత్రం  సహకారం  కాలేదని తెలిపారు. కాంగ్రెస్  పార్టీతోనే రాష్ట్ర  సాధన లక్ష్యాలు  సాధ్యమవుతాయని చెప్పారు. మిగులు  బడ్జెట్  పోయి ... రాష్ట్రాన్ని అప్పుల  పాలు  చేశారని తెలిపారు భట్టి విక్రమార్క. మాజీమంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ.. సోనియా  గాంధీ  తెలంగాణ  రాష్ట్రాన్ని  ఇచ్చారని తెలిపారు. సుదీర్ఘ  పోరాటం లో  అనేక  మంది రాష్ట్రం  కోసం త్యాగాలు  చేశారని..రాష్ట్రంలో  ఏ వర్గం  సంతోషంగా  లేదన్నారు. పొన్నాల  లక్ష్మయ్య  మాట్లాడుతూ.. సోనియా  గాంధీ చిత్తశుద్ధితో  రాష్ట్రం  ఏర్పడిందని , రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరుతో  దోచుకున్నరు  తప్ప చేసిందేమీలేదన్నారు. నిరుద్యోగ నియామకాలు పక్కన  పెట్టి ... కేసీఆర్  కుటుంబంలోనే పదవులు ఇచ్చుకున్నారని చెప్పారు. నిరంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ  కోసం  అనేక మంది ప్రాణ  త్యాగాలు చేశారని ..వారి త్యాగాలు వెల కట్టలేనివి  అన్నారు. అంజన్  కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర  ఏర్పాటులో  ఎన్ని అవరోధాలు వచ్చిన  కాంగ్రెస్  అధినేత సోనియా  గాంధీ  రాష్ట్రాన్ని  ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.