రూ. లక్ష సాయంతో పాటు..తులం బంగారం ఆడపిల్ల పెండ్లికి కాంగ్రెస్ కానుక

రూ. లక్ష సాయంతో పాటు..తులం బంగారం ఆడపిల్ల పెండ్లికి కాంగ్రెస్ కానుక
  • రూ. లక్ష సాయంతో పాటు పసుపు కుంకుమ కింద ఇద్దాం
  • మ్యానిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ప్రతిపాదన

హైదరాబాద్: కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై కసరత్తు నడుస్తోంది. కమిటీ చైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. ఆరు గ్యారెంటీలను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్  పార్టీ.. పూర్తి స్థాయి మ్యానిఫెస్టో తయారు చేసే పనిలో నిమగ్నమైందని సమాచారం. ఇందులో భాగంఆ ఆడపిల్ల పెండ్లి కానుకగా తులం బంగారం ఇస్తే బాగుంటదనే ప్రతిపాదనను చేసినట్టు తెలుస్తోంది. 

ఆడ పిల్లల పెండ్లి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే రూ. లక్ష సాయంతో పాటు తులం బంగారం ఇద్దామనే ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధిష్టానం ముందుంచిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.