లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మనోళ్ల చరిత్ర..తొలి మహిళల టెస్టును  కైవసం చేసుకున్న భారత జట్టు

లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మనోళ్ల చరిత్ర..తొలి మహిళల టెస్టును  కైవసం చేసుకున్న భారత జట్టు
  • ఇంగ్లండ్‌‌‌‌పై 270 పరుగులతో భారీ విజయం

లండన్: చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి మహిళల టెస్టు మ్యాచ్‌‌‌‌లో భారత మహిళల టీమ్​ చరిత్ర సృష్టించింది.  ఇంగ్లండ్‌‌‌‌పై 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, లార్డ్స్‌‌‌‌లో జరిగిన తొలి మహిళల టెస్టును తమ ఖాతాలో వేసుకుంది. 457 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 130/6తో ఆటను కొనసాగించింది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టం  చేయడంతో ఆ జట్టు 186 పరుగులకే ఆలౌటైంది. వికెట్‌‌‌‌కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ 54,  సోఫీ ఎక్ల్‌‌‌‌స్టోన్ 50 పరుగులతో పోరాడినా..  జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు.

భారత్ తరఫున ఆఫ్‌‌‌‌ స్పిన్నర్ స్నేహరాణా 4 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో భారత్ 285 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌‌‌‌ను 170 పరుగులకు  కట్టడి చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 7 వికెట్లకు 341 పరుగులు  డిక్లేర్ చేసి, ఇంగ్లండ్ ముందు 457 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరికి భారత బౌలర్లు ప్రత్యర్థిని 186 పరుగులకే ఆలౌట్ చేసి 270 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకున్నారు.

స్మృతి మంధాన, యస్తికా భాటియా సెంచరీలతో జట్టుకు భారీ ఆధిక్యం అందించగా, బౌలర్ క్రాంతి  తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో ఐదు వికెట్లతో సహా మ్యాచ్‌‌‌‌లో మొత్తం ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్‌‌‌‌ను దెబ్బతీసింది.  ఆమె ఆటతో లార్డ్స్  హానర్స్ బోర్డులో చోటు సంపాదించింది.  క్రాంతి, సయాలి సాత్‌‌‌‌ఘరే పిచ్‌‌‌‌పై ఉన్న  మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌ను సమర్థంగా వినియోగించుకోగా, స్నేహరాణా తన స్పిన్‌‌‌‌తో   ఒత్తిడి కొనసాగించింది.  ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 16 టెస్టుల్లో భారత్ నాలుగు విజయాలు సాధించగా..  ఇంగ్లండ్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. మిగిలిన 11 మ్యాచ్‌‌‌‌లు డ్రాగా ముగిశాయి. భారత్‌‌‌‌కు ఇంగ్లండ్ చేతిలో చివరి ఓటమి 1995లో ఎదురైంది. మ్యాచ్‌‌‌‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు  సపోర్ట్​మెసేజ్​  పంపగా, ఐసీసీ చైర్మన్ జై షా లార్డ్స్‌‌‌‌లో ప్రత్యక్షంగా మ్యాచ్‌‌‌‌ చూశారు.  

హానర్స్ బోర్డులో పేరు నిలవడం నిజమైంది :  క్రాంతి గౌడ్​ 

ప్లేయర్​ ఆఫ్ ద మ్యాచ్ క్రాంతి గౌడ్ తన ఆనందాన్ని  షేర్​ చేసుకుంది. "చిన్నప్పటి నుంచి ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. టెస్టు ప్రారంభమైనప్పటి నుంచే హానర్స్ బోర్డుపై నా పేరు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా కుటుంబం ఎంతో గర్వపడుతోంది. నాకు సహకరించిన కోచ్‌‌‌‌లు, సీనియర్లు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ మ్యాచ్‌‌‌‌లో దక్కిన స్టంప్‌‌‌‌ను ఇంట్లో ఏర్పాటు చేసిన చిన్న మ్యూజియంలో భద్రపరుస్తాను" అని ఆమె చెప్పింది.

అన్నిట్లో భారత్​ సక్సెస్​ఫుల్​గా ఆడింది  : ఇంగ్లండ్​ కెప్టెన్​ 

ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ భారత జట్టు తమకంటే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడిందని అంగీకరించింది. తొలి రోజు పరిస్థితులకు తాము సరైన విధంగా అలవాటు పడలేకపోయామని, బ్యాటింగ్‌‌‌‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యామని తెలిపింది. టెస్టుకు ముందు మరికొన్ని రోజులు సాధనకు అవకాశం లభించి ఉంటే బాగుండేదని పేర్కొంటూనే, ఫార్మాట్ మార్పులకు సిద్ధంగా ఉండటం ప్రతి క్రికెటర్ బాధ్యతేనని వ్యాఖ్యానించింది.

లార్డ్స్‌‌‌‌లో ఇంకా 10 టెస్టులు ఆడాలని ఉంది: హర్మన్‌‌‌‌ప్రీత్

మ్యాచ్​ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేసింది. "లార్డ్స్‌‌‌‌లో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ మహిళల టెస్టు నిర్వహించాలని ఆలోచించిన వారికి ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని టెస్టులు జరగాలి. కనీసం మరో 10 టెస్టులు ఆడే అవకాశం రావాలని కోరుకుంటున్నా" అని ఆమె చెప్పింది. యస్తికా భాటియా  సెంచరీతో పాటు ఓపెనర్లు అందించిన స్కోర్​  విజయానికి కీలకమైందని హర్మన్‌‌‌‌ప్రీత్ పేర్కొంది. ఫీల్డింగ్‌‌‌‌లోనూ అందరూ  అంకితభావంతో  ఆడారని  ప్రశంసించింది.