కాంగ్రెస్ విద్యుత్ సౌధ ముట్టడి ఉద్రిక్తత

 కాంగ్రెస్ విద్యుత్ సౌధ ముట్టడి ఉద్రిక్తత

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన విద్యుత్ సౌద ముట్టడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళ కాంగ్రెస్  ఆధ్వర్యంలో విద్యుత్ సౌద ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, మహిళ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఎంతచెప్పినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురి మధ్యఘర్షణ జరిగింది. తోపులాటలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు విద్యారెడ్డి కిందపడటంతో స్పృహతప్పి పడిపోయారు.ఆమెకు శ్వాస సమస్యలు ఉండటంతో ఊపిరి  తీసుకోవడం కష్టంగా మారింది.వెంటనే ఆమెను హుటాహుటిన నిమ్స్ కు తరలించారు. విద్యారెడ్డికి ఆస్పత్రిలో డాక్టర్లు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. పోలీసుల తీరుపై మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

గోటబయ రాజీనామా  ప్రసక్తే లేదు

కాలినడకన రామయ్య పెండ్లికి