పంజాబ్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసిన కాంగ్రెస్

పంజాబ్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసిన కాంగ్రెస్

చండీఘఢ్‌: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం కోసం హేమాహేమీలను రంగంలోకి దింపుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేసింది. పార్టీ తరఫున 30 మంది క్యాంపెయినింగ్ నిర్వహిస్తారని ప్రకటించింది. 

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, భూపిందర్ సింగ్ హూడా, ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా, భూపేష్ బఘేల్, రాజీవ్ శుక్లా తదితరులు ఉన్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా క్యాంపెయినింగ్ లో పాలుపంచుకోనున్నారు. 117 స్థానాలు కలిగిన పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న ఎన్నిక జరగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

యూజీసీ ఛైర్మన్గా జెఎన్యూ వీసీ జగదీశ్ కుమార్

వాళ్లు ప్రజల పొట్ట కొట్టి సొంత ఖజానాలు నింపుకుంటరు