మోడీ తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు

మోడీ తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని అయ్యాక కూడా ఆయన మూలాలు ఎప్పుడూ మరిచిపోలేదన్నారు. చిన్నప్పుడు గిన్నెలు తోమానని, టీ అమ్మానని మోడీ చాలా సార్లు చెప్పారని ఆయన గుర్తుచేశారు. మనం ఏ స్థాయిలో వున్నా గతాన్ని మరిచిపోకూడదన్నారు ఆజాద్.

కొద్దిరోజుల క్రితం రాజ్యసభలో ఆజాద్‌కు వీడ్కోలు చెబుతూ..మోడీ భావోద్వేగాని లోనయ్యారు. పదవీకాలం ముగిస్తున్న నేతలను ఉద్దేశించి ఆయన కాసేపు ప్రసంగించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ గురించి మాట్లాడేటప్పుడు మోడీ కంటతడి పెట్టుకున్నారు. సుదీర్ఘకాలం… రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆజాద్ దేశానికీ అందించిన సేవలను ప్రధాని కొనియాడారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిమంతుడని తెలిపారు. ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర సభ్యులు, భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.