ఎల్బీనగర్,వెలుగు: ప్రేమ పేరుతో నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో కానిస్టేబుల్ ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అజంపురాలోని రాజనర్సింహ నగర్ కాలనీకి చెందిన ఆవులగడ్డ అభిలాష్ కుమార్ యాదవ్ ( 32 ) సిటీ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్. అతడు నాగోల్, జైపురికాలనీలో ఉంటున్నాడు. అభిలాష్కి మూడేళ్ల కిందట ఓ యువతితో పరిచయమై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.యువతికి ప్రెగ్నెన్సీ కాగా.. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో బల్కంపేట్ లోని ఓ టెంపుల్ లో తాళి కట్టాడు. వారికి ఒక బాబు పుట్టి అనారోగ్యంతో చనిపోయాడు. అభిలాష్ వేరే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, మోసపోయిన యువతి తన తండ్రితో కలిసి ఎల్బీనగర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో అభిలాష్ యువతిని మోసం చేసినట్లు తేలడంతో గురువారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
ఇవి కూడా చదవండి
4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?
హఫీజ్పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు
చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!
ఫేస్ బుక్-వాట్సప్లలో చర్చిస్తారు.. ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తారు