యువతిని మోసగించిన కానిస్టేబుల్​ అరెస్ట్

యువతిని మోసగించిన కానిస్టేబుల్​ అరెస్ట్

ఎల్​బీనగర్,వెలుగు: ప్రేమ పేరుతో నమ్మించి   యువతిని మోసం చేసిన  కేసులో కానిస్టేబుల్ ను ఎల్​బీనగర్​ పోలీసులు అరెస్ట్ చేశారు. అజంపురాలోని  రాజనర్సింహ నగర్ కాలనీకి చెందిన ఆవులగడ్డ అభిలాష్ కుమార్ యాదవ్ ( 32 )  సిటీ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్. అతడు నాగోల్, జైపురికాలనీలో ఉంటున్నాడు. అభిలాష్​కి మూడేళ్ల కిందట ఓ యువతితో పరిచయమై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.యువతికి ప్రెగ్నెన్సీ కాగా.. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో బల్కంపేట్ లోని ఓ టెంపుల్ లో తాళి కట్టాడు. వారికి ఒక బాబు పుట్టి అనారోగ్యంతో చనిపోయాడు. అభిలాష్ వేరే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, మోసపోయిన యువతి తన తండ్రితో కలిసి ఎల్​బీనగర్​ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో అభిలాష్ యువతిని మోసం చేసినట్లు తేలడంతో గురువారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు.

ఇవి కూడా చదవండి

4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ