కానిస్టేబుల్‌‌పై సుత్తితో దాడి.. బోరబండ పీఎస్ పరిధిలో ఘటన

కానిస్టేబుల్‌‌పై సుత్తితో దాడి.. బోరబండ పీఎస్ పరిధిలో ఘటన

జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ పీఎస్ పరిధిలో శనివారం అన్నదమ్ములు మహమ్మద్ షా ఫైజల్, ముబీన్​భూమి, డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. అడ్డుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ పి.యజుర్వేదపై ఫైజల్ సుత్తితో దాడి చేశాడు. దుకాణంలోని వస్తువులను ధ్వంసం చేస్తుండగా ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ ముఖం, పక్కటెముకలపై నిందితుడు దాడికి తెగబడ్డాడు. గాయపడిన బాధితురాలిని హాస్పిటల్​కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.