జిమ్ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్

జిమ్  చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్

బోయిన్ పల్లిలో  ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. ఆసిఫ్ నగర్ పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న విశాల్ (24) ఇవాళ ఉదయం సికింద్రాబాద్ లోని ఓ జిమ్ కు వెళ్లాడు. ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడున్న వారు వెంటనే అతడిని  ఆస్పత్రికి తరలించగా అప్పటికే  గుండెపోటుతో చనిపోయినట్లు  వైద్యులు చెప్పారు.  

గత కొన్నిరోజులుగా హార్ట్ ఎటాక్ ఘటనలు  ఆందోళన కల్గిస్తున్నాయి.  నిత్యం వ్యాయామం చేసేవారినీ కూడా  హార్ట్ ఎటాక్ వదలడం లేదు.  కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. పునీత్ నుంచి తారకరత్న దాకా గుండెపోటుతో మృత్యువాత పడ్డారు.  రెండు రోజలు క్రితం  హైదరాబాద్ పాతబస్తీలో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో  అందరితో నవ్వుతూ పలకరిస్తూ కూర్చుని కుప్పకూలిన ఘటన మరువకముందే ఇవాళ విశాల్  కూడా చిన్ని వయసులోనే చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది.