- కరెంట్ షాక్తో భవన నిర్మాణ కార్మికుడి మృతి
చర్లపల్లి, వెలుగు : కరెంట్ షాక్తో భవన నిర్మాణ కార్మికుడు చనిపోయిన సంఘటన చర్లపల్లి పీఎస్పరిధిలో జరిగింది. సీఐ మల్లికార్జున్రెడ్డి తెలిపిన ప్రకారం.. చత్తీస్గడ్కు చెందిన పురుషోత్తం కుటుంబంతో సిటీకి వచ్చాడు. లక్ష్మినగర్లో నిర్మాణం జరుగుతున్న సునీల్ప్రసాద్ఇంట్లోనే ఉంటున్నాడు.
శుక్రవారం పురుషోత్తం(41) ఇంటిపనులు జరుగుతున్న క్రమంలోనే సెకండ్ఫ్లోర్లో ఇనుప తడక చేతి నుంచి జారి పక్కనే ఉన్న11కేవీ విద్యుత్ తీగలపై పడింది. దీంతో అతడు పట్టుకున్న ఇనుప తడకకు విద్యుత్ ప్రసరించడంతో స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడికి భార్య, ఏడాది బాబు నుంచి పదేళ్లలోపు ఐదుగురు పిల్లలున్నారు.
మేడ్చల్లో మరొకరు..
మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో కిష్టాపూర్ స్మశాన వాటిక వద్ద జార్ఖండ్ కు చెందిన దిలీప్ (22) శుక్రవారం కరెంట్ స్తంభం ఎక్కి ఇంటర్నెట్ పనులు చేస్తున్నాడు. పక్కనే విద్యుత్ స్తంభం ఉన్న కరెంటు వైర్ షాక్ తగిలి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.