ఏపీ బస్సును ఢీకొట్టిన కంటైనర్

ఏపీ బస్సును ఢీకొట్టిన కంటైనర్
  •     ఎన్ హెచ్ 44పై భారీగా ట్రాఫిక్  జామ్

గద్వాల, వెలుగు: ఏపీకి చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సును కంటైనర్  ఢీకొట్టడంతో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మారం స్టేజీ దగ్గర 44 నెంబర్​ హైవేపై ఆదివారం రాత్రి ట్రాఫిక్​ జామ్​ అయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

ఏపీలోని బనగానపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్​ హైదరాబాద్​ నుంచి బనగానపల్లెకు వెళ్తుండగా కర్నూల్  నుంచి హైదరాబాద్  వైపు వెళ్తున్న కంటైనర్  ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారికి గాయాలయ్యాయి. వారిని హైవే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై యాక్సిడెంట్  జరగడంతో హైవేపై భారీగా ట్రాఫిక్  జామ్  అయింది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.