తాండూరు,వెలుగు : సిట్టింగ్ కౌన్సిలర్గా తమకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి టిక్కె ట్ ఇవ్వడం అన్యాయం అని టీఆర్ఎస్ నాయకుడు హరిహరగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి ఇన్నాళ్లు గ్రూప్ రాజకీయాలు పోషించి టిక్కెట్ల పంపకాల్లో కుమ్మ క్కయ్యా రని ఆరోపించారు. 13వ వార్డులో తాను రెబల్ గా పోటీచేసి టీఆర్ఎస్ ను ఓడిస్తానని శపథం చేశారు. తనతో పాటు మరి కొందరికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

